పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,500 స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నిర్వాహకులను అరెస్ట్ చేశారు.