ఖమ్మం జిల్లాలో ఆగని ఆందోళనలు

5 Oct, 2016 12:36 IST|Sakshi

ఖమ్మం: ఖమ్మం జిల్లా విభజన నేపథ్యంలో వివిధ డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను ముక్కలు చేయవద్దని కోరుతూ బస్సు యాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆదివాసీ బస్సుయాత్ర టేకులపల్లికి చేరుకుంది. షెడ్యూల్డ్ ఏరియాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక బోడు రోడ్డు సెంటర్‌లో ధర్నా చేపట్టారు. వాజేడు, వెంకటాపురం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు బంద్ చేపట్టాయి. రెండు మండలాలను వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కలపాలనే ప్రతిపాదనను విర మించుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు