నూజివీడులో కొండచిలువ కలకలం

2 Nov, 2016 12:39 IST|Sakshi
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం పాతపేటలో భారీ కొండచిలువ కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోకి బుధవారం తెల్లవారుజామున కొండచిలువ ప్రవేశించింది. 12 అడుగుల కొండచిలువను గుర్తించిన కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై కొండచిలువను చంపేశారు. 
మరిన్ని వార్తలు