‘భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం’

3 Jan, 2017 11:31 IST|Sakshi
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ వంద కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యాత్రికులకు సౌకర్యాల కల‍్పనకు, పర్యాటకం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని  చెప్పారు.
మరిన్ని వార్తలు