దారూర్ లో అఖిలపక్షం రాస్తారోకో

20 Sep, 2016 16:32 IST|Sakshi

దారూర్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రగులుతున్న చిచ్చు చల్లారటం లేదు. రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేయతలపెట్టిన 3 మండలాలను యథాస్థానంలో ఉంచాలని మంగళవారం అఖిలపక్షాలు ఆంతోళన చేపట్టాయి. వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తాండూరు- హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో కలపవద్దని కోరారు. ప్రజల ఆందోళన కారణంగా రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు