మైత్రేయను కాపురానికి రమ్మనండి

19 Sep, 2014 02:20 IST|Sakshi
మైత్రేయను కాపురానికి రమ్మనండి

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వర్ధమాన నటి మైత్రేయను తాను వివాహం చేసుకున్నానని సంచలన ప్రకటన చేసిన కన్నడ దర్శకుడు రుషి.. మైత్రేయ తనతో కలసి ఉండడం లేదని, తనతో కాపురం చేయాల్సిందిగా ఆమెను ఆదేశించాలని కోరుతూ ఇక్కడి కుటుంబ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. రైల్వే మంత్రి సదానందగౌడ తనయుడు కార్తీక్‌గౌడపై అత్యాచారం, వంచన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మైత్రేయ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు