రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి

12 Oct, 2016 18:20 IST|Sakshi
రాజోలు : వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో అక్కాచెల్లెళ్లుమృతిచెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ లాకుల సెంటర్‌లో బుధవారం చోటుచేసుకుంది. 
 
బి. సావరం గ్రామానికి చెందిన శిరీషా(12), అనూష(8) తండ్రితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
>
మరిన్ని వార్తలు