ఘనంగా రెండో రోజు రొట్టెల పండగ

13 Oct, 2016 10:13 IST|Sakshi

నెల్లూరు: బారా షహీద్ దర్గాలో గురువారం రొట్టెల పండగ రెండో రోజుకు చేరుకుంది. ఈ పండగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రొట్టెల పండగలో రాత్రికి గంధమహోత్సవం జరగనుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం బారా షహిద్ దర్గాలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రార్థనలు చేయనున్నారు. దీంతో దర్గా వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు.  మరో రెండు రోజులు ఈ రొట్టెల పండగ కొనసాగనుంది.
 

మరిన్ని వార్తలు