ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెనుప్రమాదం ..

12 Nov, 2016 21:00 IST|Sakshi

రాజమండ్రి : రాజమండ్రిలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి పీలేరుకు బయల్దేరిన బస్సుకు ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలైయ్యాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికుల్లో నలుగురికి గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు క్షతగ్రాతులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు