ఘనంగా రన్ ఫర్ యూనిటీ

31 Oct, 2014 22:36 IST|Sakshi
ఘనంగా రన్ ఫర్ యూనిటీ

సాక్షి, ముంబై: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్కవారం ఉదయం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ‘రన్ ఫర్ యూనిటీ’ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుంచి ప్రారంభమై మెరైన్ డ్రైవ్‌లోని పార్శీ జింఖానా వద్ద ముగిసింది. రెండు కి.మీ.మేర సాగిన ఈ కార్యక్రమంలో బజ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రావ్‌సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొన్నారు.

వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబరు 31వ తేదీని ‘రాష్టీయ ఏక్తా దివస్’ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా గవర్నర్ దేశ ఐక్యతను, శాంతి, భద్రతలను కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని కార్యక్రమానికి హాజరైన వారిచేత ప్రమాణం చేయించారు. అలాగే ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికి చేరవేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.

మరిన్ని వార్తలు