శివసేన కార్యకర్త అరెస్ట్‌

26 Jul, 2017 10:53 IST|Sakshi
శివసేన కార్యకర్త అరెస్ట్‌
ముంబయి: మంగళవారం ఘాట్కోపర్‌ శివార్లలోని దామోదర్ పార్క్ ఏరియాలో అకస్మాత్తుగా ఐదు అంతస్తుల భవనం కూలిపోయి 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శివసేన కార్యకర్త అరెస్టయ్యాడు. సునీల్‌ సితాప్‌ నర్సింగ్‌ హోమ్‌ పునర్నిర్మాణ సమయంలో ఈ భవనం కూలిపోయింది. సితాప్‌ నిర్లక్ష్యం వలనే భవనం కూలిందని కేసు నమోదయింది. నిన్న రాత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. 
 
>
మరిన్ని వార్తలు