పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి

28 Aug, 2016 13:44 IST|Sakshi
పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి
దర్భాంగా: బిహార్లోని దర్భాంగా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. టొలి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు పాముకాటుతో మృతి చెందారు. అన్నాచెల్లెలు.. ఆనంద్ పండిట్(12),  కిరణ్ కుమారి(10)లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శనివారం అర్థరాత్రి సమయంలో వారిని పాము కాటేసింది.
 
వీరిని తల్లిదండ్రలు వెంటనే దర్భాంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స అందిస్తుండగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దిల్నవాజ్ అహ్మద్ వెల్లడించారు. మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
 
మరిన్ని వార్తలు