మెదక్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో.. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 29..99 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 29.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 8,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి కోసం 2,300 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.