సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం.
ఇదే ఆస్పత్రిలో తమిళనాడు సీఎం జయలలిత చికిత్స పొందుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో సందర్శకులను అనుమతించడం లేదు. ఈ పరిస్థితిలో ఈయన కూడా అపోలోలో చేరడంతో భారీగా భక్తులు వస్తున్నారు.