వార్డెన్‌, హెచ్‌ఎంను సస్పెండ్‌ చేయాలి

31 Jan, 2017 13:00 IST|Sakshi
ఇల్లెందు: గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ వార్డెన్‌, పాఠశాల హెడ్మాస్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడ్‌ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహానికి చెందిన 11 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిపోయాయి. ఈ వ్యవహారంలో వార్డెన్‌ను, హెచ్‌ఎంను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారి అక్కడికి వచ్చి వారికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
మరిన్ని వార్తలు