కోర్టులో నటి రాధ

29 Nov, 2013 02:54 IST|Sakshi
తమిళసినిమా, న్యూస్‌లైన్: సుందర్ ట్రావెల్స్ చిత్ర హీరోయిన్ రాధ న్యాయం కోసం కోర్టుకెక్కారు. నిర్మాత పైసూల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని, తన వద్ద తీసుకున్న రూ.50 లక్షలు తిరిగి ఇవ్వమంటే పడక గదిలో దొంగచాటుగా తీసిన ఫొటోలను చూపి హత్యా బెదిరింపులు చేస్తున్నారని ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై వడపళని పోలీసు లు దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాత పైసూల్ పరారీలో ఉన్నాడు. తాజాగా అతను ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి ఆదినాథన్ సమక్షంలో విచారణకు వచ్చింది. కోర్టుకు హాజరైన నటి రాధ తనను వివాహం చేసుకుంటానని ఆరేళ్లు సహజీవనం చేసి మోసానికి పాల్పడిన పైసూల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి డిసెంబరు నాలుగవ తేదీకి వాయిదా వేశారు.
 
మరిన్ని వార్తలు