పైడేటిలో టీడీపీ నేతల దౌర్జన్యం

12 Sep, 2016 04:09 IST|Sakshi

పెనుకొండ (పరిగి) : అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తూ.. వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తూ.. పోలీసుల చేత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ వారికి వంతపాడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మూడు రోజుల కిందట వినాయక నిమజ్జనం సందర్భంగా పైడేటిలో ఇరువర్గాల మధ్య స్వల్ప వివాదం నెలకొంది. దీన్ని అదునుగా ఎంచుకున్న టీడీపీ నేతలు శనివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విరుచుకుపడి దేవేంద్రప్ప అనే వ్యక్తితో పాటు మరి కొందరిపై దాడి చేశారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను సైతం టీడీపీ ముఖ్య నేతల ఒత్తిడితో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఇతర స్టేషన్లకు తీసుకువెళ్లి తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 15 మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొనగా.. మరికొందరిని అరెస్ట్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని గ్రామంలో పలువురు విమర్శిస్తున్నారు. 

మరిన్ని వార్తలు