వ్యభిచారం చేస్తూ దొరికిన టీడీపీ నేత

6 Feb, 2017 15:56 IST|Sakshi
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలకేంద్రంలో ఓ టీడీపీ నాయకుడు వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో సదరు నేత వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. పట్టుబడిన టీడీపీ నేత ముప్పాళ్ల మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుబాబుగా గుర్తించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు యువతులను, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరినీ స్టేషన్‌కు తరలించారు. 
మరిన్ని వార్తలు