గుంటూరు టీడీపీలో ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

10 Sep, 2016 13:51 IST|Sakshi
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. పిడుగురాళ్లలో రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. 

స్థానిక ఎంపీటీసీ రాంరెడ్డి సైదమ్మ(టీడీపీ) వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే నెపంతో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆమె పై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎంపీటీసీ వర్గీయులు కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు