శ్మశానంలో ఉచిత వైఫై

16 Apr, 2017 09:19 IST|Sakshi
శ్మశానంలో ఉచిత వైఫై

కొరుక్కుపేట(చెన్నై): చెన్నై అన్నానగర్, న్యూ ఆవడి రోడ్డులోని వేలాంగాడు శ్మశాన వాటికలో శనివారం నుంచి ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు శ్మశానవాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌(ఐసీడబ్ల్యూవో), గ్రేటర్‌ చైన్నై కార్పొరేషన్, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మీనంబాక్కం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైఫై సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైఫై ద్వారా అంత్యక్రియలను విదేశాల్లోని ఆప్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. అంత్యక్రియలకు రాలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వివరించారు.

>
మరిన్ని వార్తలు