రాష్ట్రంలోనూ ఆ ఫలితాలే!

21 May, 2016 02:30 IST|Sakshi
రాష్ట్రంలోనూ ఆ ఫలితాలే!

2018 ఎన్నికల్లో సత్తా చాటుతాం
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప

 

తుమకూరు: ఐదు రాష్ట్రాల్లో  జరిగిన ఎన్నికల ఫలితాలే కర్ణాటక రాష్ట్రంలో కూడా పునరావృతం కానున్నాయని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప జోస్యం చెప్పారు. నగరంలోని సిద్ధగంగా మఠ శివకుమార్ స్వామీజీని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు పంపనున్న అభ్యర్థులపై పార్టీ సీనియర్  నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.


విధాన పరిషత్‌కు జర గనున్న ఎన్నికలకు త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనంతో ఉన్న ప్రజలు 2018లో జరిగే ఎన్నికల్లో ఆపార్టీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో  జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎంఎల్‌ఏ బీ.సురేశ్‌గౌడ  పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు