ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

10 Nov, 2016 17:27 IST|Sakshi

చేబ్రోలు : గుంటూరు జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. చేబ్రోలులోని ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం రాత‍్రి చోరీ జరిగింది. స్థానిక అగ్రిగోల్డ్ ఫ్లాట్‌ల వద్ద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించిన దుండగులు సువర్చలదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు