తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్, తాతగుడి పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని ఇళ్లు చూసి చోరీలకు పాల్పడ్డారు. ఆరు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. ఎంత మొత్తం చోరీ అయింది అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.