'హుబ్లి'పై విరిగిపడిన కొండచరియలు

21 Aug, 2017 12:12 IST|Sakshi
ముంబై: కొండచరియలు విరిగి కదులుతున్న రైలుపై పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి కర్ణాటక వెళ్తున్న హుబ్లి ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం లోనావాలా సమీపంలోకి రాగానే కొండచరియలు విరిగిపడ్డాయ. ఎస్‌-4 భోగీ పై పెద్ద బండరాయి పడటంతో అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని కళ్యాణ్‌ రైల్వే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులతో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంల వల్ల ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరిన్ని వార్తలు