గుర్గావ్‌లో ముగ్గురి కిడ్నాపర్ల అరెస్టు

13 Dec, 2014 23:48 IST|Sakshi

గుర్గావ్: నగరంలో ముగ్గురు కిడ్నాపర్లను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలి పారు. యువకుడిని అపహరించిన, అతడి విడుదలకు రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. డిసెంబర్ 12వ తేదీన పామ్ విహార్‌కాలనీకి చెందిన 18 ఏళ్ల మానవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో అపహరించుకొని పారిపోయారు. ఈ మేరకు పామ్ విహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీ స్ కమిషనర్(పశ్చిమ) సంగీతా కాలియా తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కిడ్నాపర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
 ఈ క్రమంలో బాధితుడి తండ్రికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి, రూ. 5 కోట్లను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు సమాచారం అందజేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన బృందాలు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఈ సమాచారం తెలుసుకొన్న కిడ్నాపర్లు ఆందోళనకు గురై శుక్రవారం రాత్రి బాధితుడిని వదిలేశారు. బాధితుడు గుర్తిం చిన ఆ ముగ్గిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక నిందితుడిని అక్షయ్ పూని యాగా గుర్తించారు. ఇతడు బాధితునికి సుపరిచితుడేనని పోలీసులు తెలిపారు. మోహిత్ జోషి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు