గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలో పెద్ద పులి కాలిముద్రలను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని పులి కాలిముద్రలు పరిశీలిస్తున్నారు.