నేడు సీఎం ప్రజెంటేషన్

27 Dec, 2013 00:20 IST|Sakshi

ముంబై: తన ప్రభుత్వ పరిపాలన తీరు గురించి  రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పనితీరును సమీక్షించాలన్న పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ ప్రక్రియంతా అని మంత్రాలయ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు.

ధరల పెరుగుదల, గతేడాది వేసవిలో కరువు సంభవించినప్పుడు తీసుకున్న చర్యలు, విదర్భలో తరచూ వరదలు వచ్చినప్పుడు తీసుకున్న సహాయక చర్యలు గురించి పార్టీ అధిష్టానానికి సీఎం చవాన్ వివరిస్తారని చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, కొత్తగా తీసుకొచ్చిన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం ఎలా అమలుచేయనుందన్న విషయాలను కూడా చెబుతారని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు