లంచం ఇవ్వనందుకు ఇటుక రాయితో దాడి

11 May, 2015 15:38 IST|Sakshi
లంచం ఇవ్వనందుకు ఇటుక రాయితో దాడి

న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో ఓ మహిళపై పట్టపగలు ఇటుక రాయితో దాడి చేసిన ఘటనలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ...  తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ సౌత్ ఢిల్లీలో స్కూటీపై వెళుతుండగా సతీష్ చంద్ర అనే  హెడ్ కానిస్టేబుల్  ఆమెను ఆపాడు. నిబంధనలు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్  చేస్తున్నావంటూ మహిళను ఆపి లంచం డిమాండ్ చేశాడు.  అందుకు ఆ మహిళ నిరాకరించింది.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. అదికాస్తా వాగ్వివాదానికి దారితీసింది. దాంతో సహనం కోల్పోయిన సతీష్ చంద్ర ...మహిళపై ఇటుకతో దాడి చేశాడు.  ఈ వ్యవహారాన్ని దారిన వెళ్లే వాళ్లు తీసిన వీడియో బయటకు రావటంతో కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్ ఆధారంగా కానిస్టేబుల్పై  క్రిమినల్ కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు