ముచ్చటగా మూడోసారి

14 Jul, 2015 03:16 IST|Sakshi
ముచ్చటగా మూడోసారి

నటుడు సిద్ధార్థ్ధ్‌తో ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేసేస్తున్నారు నటి త్రిష. ఈ జంటింతకుముందు తమిళంలో ఒకసారి, తెలుగులో ఒకసారి రొమాన్స్ చేసేశారు. దర్శకుడు మణిరత్నం శిష్యుడయిన సిద్ధార్థ్ బాయ్స్ చిత్రం ద్వారా నలుగురు నవ హీరోల్లో ఒకరిగా పరిచయమయిన విషయం తెలిసిందే. ఆ తరువాత గురువు దర్శకత్వంలో ఆయుధ ఎళుత్తు చిత్రంలో ముగ్గురు హీరోల్లో యువ హీరోగా నటించారు. ఇందులో ఆయనకు జంటగా త్రిష నటించారు. ఆ చిత్రం యావరేజ్‌గా ఆడినా, సిద్ధార్థ్, త్రిషల రొమాన్స్ సన్నివేశాలు కుర్రకారును గిలిగింతల పెట్టించాయి.
 
 ఇక రెండోసారి తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో రొమాన్స్ చేశారు. ఆ చిత్రం ఈ జంటను హిట్ ఫెయిర్ చేసేసింది. అయితే ఎందుకనో ఆపై సిద్ధార్థ్ త్రిషలు ఏ చిత్రంలోనూ కలిసి నటించలేదు. అలాంటిది సుమారు ఒక దశాబ్దం తరువాత వీరిద్దర్నీ దర్శకుడు సుందర్.సి కలిపారు. అవును. ఆయన దర్శకత్వం వహిస్తున్న అరణ్మణి-2లో సిద్ధార్థ్ త్రిష జంటగా నటిస్తున్నారు. నిజానికి సిద్ధార్థ్‌కు ఇప్పుడో హిట్ చాలా అవసరం. తమిళంలో ఇనకుళ్ ఒరువన్. కావ్యతలైవన్ చిత్రాలు వరుసగా సిద్ధార్థ్‌ను నిరాశపరిశాయి. అంతకుముందు తీయ వేల సేమనుమ్ కుమారు చిత్రంతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు సుందర్.
 
 ఈయన్నే మరో సారి నమ్ముకున్నాకు నటుడు సిద్ధార్థ్. అలా అనేకంటే మాజీ ప్రియురాలు కరుణించిందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. ఎస్ నటి సమంతనే ఈ చిత్రంలో సిద్ధార్థ్ నటించడానికి సిఫార్సు చేశారని సమాచారం. ఏదేమయినా అరణ్మణి-2లో సిద్ధార్థ్ త్రిషలు మూడోసారి రొమాన్స్ చేస్తున్నారన్నది వాస్తవం. ఇందులో మరో హీరోయిన్లుగా హన్సిక, పూనంబాజ్వాలు నటిస్తున్నార న్నది గమనార్హం. చిత్రం ఇప్పటికే నిర్మాణంలో ఉంది.
 

మరిన్ని వార్తలు