దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు

4 Oct, 2016 11:25 IST|Sakshi
దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు
ఇంద్రకీలాద్రి:  విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. దసరా సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్బంగా టీటీడీ తరపున డిప్యూటీ ఈవో బాలాజీ పట్టు వస్త్రాలను దుర్గ గుడి ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారికి సమర్పించే సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
 
>
మరిన్ని వార్తలు