= ఉద్యాన నగరిలో పట్టపగలు జంట హత్యలు
= గొంతు కోసి కిరాతకంగా..
బెంగళూరు (బనశంకరి) : అత్త, కోడలు దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం ఉదయం నగరంలోని హైగ్రౌండ్స్లో పీఎస్లో చోటుచేసుకుంది. వివరాలు... వసంత నగరలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సంపత్రాజ్ కుటుంబం నివాసముంటోంది. సంపత్రాజ్ నగరంలోని బళేపేటేలో రసాయనిక దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఉదయం సంపత్ దుకాణానికి వెళ్లగా అత్త సంతోషిబాయి (59), కోడలు లత (38) ఇంటిలో ఉన్నారు.
ఉదయం 8 గంటల సమయంలో ఇంటిలోకి చొరబడిన దుండగులు మారణాయుధాలతో గొంతుకోసి దారుణంగా హతమార్చి ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, వేలి ముద్రల నిపుణులతో అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే మృతుల ఒంటిపై బంగారు ఆభరణాలు అలాగే ఉండటంతో పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సందీప్పాటిల్, అదనపు కమిషనర్ చరణ్రెడ్డి పరిశీలించారు.