బైక్ రేసింగ్‌.. ఇద్దరి మృతి

1 Jan, 2017 09:46 IST|Sakshi
బైక్ రేసింగ్‌.. ఇద్దరి మృతి

రాజంపేట(వైఎస్సార్‌జిల్లా): కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి బైక్ రేసింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. బైక్ రేసింగ్ లో పాల్గొన్న మూడు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు