సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి

26 Jan, 2017 16:21 IST|Sakshi
ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని అన్నోజిగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదాతో  ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలోని నారాయణ జూనియర్‌ కాలేజ్‌కు చెందిన అవినాష్‌(16), పీడీఎస్‌ చరణ్‌(16)లు స్థానికంగా ఉండే ఓ నీటి గుంత వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు