న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో చలి బారీన పడి బాలురు మరణాలు సంభవించడంపై జాతీయ మానవహక్కుల కమిషన్ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ముజాఫర్నగర్, షామ్లీలలో ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో 40 మంది బాలలు చలిబారీన పడి మరణించారన్న మీడియా వార్తలపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఈ శిబిరాల్లో బాధితుల మరణాల మీద వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, జిల్లా మేజిస్ట్రేట్కు నోటీసులిచ్చింది.