‘బంగారు తెలంగాణకు బాటలు పడాలి’

12 Jan, 2017 16:13 IST|Sakshi
హైదరాబాద్‌: ప్రజలు సంక్రాంతి పండుగ‌ను ఘనంగా జరుపుకోవాలని, రాష్ట్రం బంగారు తెలంగాణ‌గా రూపు దిద్దుకునేందుకు బాట‌లు ప‌డాల‌ని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహ‌క అధ్యక్షుడు భ‌ట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వారు గురువారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ‌ల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఏ వ‌ర్గం ప్రజలు కూడా సంతోషంగా లేర‌ని, ప్రతి రోజూ ఉద్యమాలతో హక్కుల సాధ‌న కోసం రోడ్డెక్కుతున్నారని పేర్కొన్నారు. సామాన‍్య ప్రజలు ఆశించిన తెలంగాణ రాలేద‌ని వారు అన్నారు. ప్రజల ప‌క్షాన సమస్యల సాధ‌న కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంద‌ని భరోసా ఇచ్చారు.
>
మరిన్ని వార్తలు