కార్డన్‌ సెర్చ్‌.. 40 వాహనాలు సీజ్

4 Jan, 2017 09:15 IST|Sakshi

కరీంనగర్‌: కరీంనగర్‌ హుస్సేన్‌పురాలో పోలీసులు బుధవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ ఉదయం 5.30 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్డన్ సెర్చ్ 9 గంటల సమయంలోనూ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 లీటర్ల కిరోసిన్‌(రేషన్‌)ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, ఏసీపీ రామారావుల ఆధ్వర్యంలో పదిమంది సీఐలు, 300మంది పోలీసు సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు