సాక్షి, బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు ఆర్ఎన్ సుదర్శన్ (78) మృతి చెందారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. సుదర్శన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
ఆయన కన్నడ, తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించారు. 2010లో హీరో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ చిత్రంతో సందర్శన్ చివరిసారిగా నటించారు. అలాగే మణిరత్నం డైరక్షన్లో కమల్హాసన్ హీరోగా నటించిన నాయగన్లోనూ ప్రతినాయక పాత్ర పోషించారు. సుదర్శన్ భార్య శైలశ్రీ కూడా నటి. కాగా సుదర్శన్ మృతిపట్ల కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.