మొరాయించిన రైలింజన్‌

3 Mar, 2017 14:23 IST|Sakshi
- పలు రైళ్లు ఆలస్యం
 
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఇంజన్‌ మొరాయించడంతో ఓ గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే శాతవాహన రైలు ఆలస్యంగా నడుస్తోంది. అలాగే కాజీపేట నుండి హైదరాబాద్ వెళ్లే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరిన్ని వార్తలు