శాండిల్వుడ్కు ఖండన
చెన్నై: కావేరి నదీ జలాల హక్కు ల పరిరక్షణకు అమ్మ జయలలిత ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పయనం ఉంటుందన్నారు. సీఎం జయలలితను కిం చపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన శాండిల్వుడ్ నటుల తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులోని ఆర్కే.రెసిడెన్సీ హాల్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు.
సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ తమిళ ప్రజల దాహార్తి తీర్చడానికి, రైతుల వ్యవసాయానికి నీరు అందించడానికి అమ్మ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కర్ణాటకకు చెందిన వారు ఆందోళనకు దిగడం సరైన చర్య కాదన్నారు. ఈ వ్యవహారంలో కన్నడ నటుల చర్యలను తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, న్యాయస్థానం తీర్పును ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిందేనని వ్యా ఖ్యానించారు. కావేరి జలాల విషయంలో అమ్మ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము అండగా ఉంటామని ప్రకటించారు.