వోల‍్వో బస్సులో అగ్నిప్రమాదం

12 Aug, 2017 14:20 IST|Sakshi
చెన్నై : క‌ర్నాట‌క రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస‍్థకు చెందిన ఏసీ బ‌స్సు శనివారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైంది. బ‌స్సు వెన‌క భాగంలో భారీ మంట‌లు ఎగిసిప‌డ్డాయి. తమిళనాడులోని పూన‌మ‌ల్లె జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ‍్బంది వెళ్ళి మంటలను ఆర్పివేశారు.
మరిన్ని వార్తలు