శెభాష్‌ కామేగౌడ

31 Jul, 2018 12:09 IST|Sakshi
కామేగౌడ తవ్విన చెరువు

సొంతంగా చెరువులను తవ్విన ఆదర్శ రైతు  

మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు

కర్ణాటక, మండ్య: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా ఆ సన్నకారు రైతు నడుంబిగించి జల సిరులను సృష్టించారు. సొంత డబ్బులతో నీటి నిల్వ కోసం సుమారు 14 చెరువులను తవ్వించిన మండ్య జిల్లాలోని మళవళ్లి తాలుకాలో ఉన్నదాసనగొడ్డి గ్రామానికి చెందిన రైతు కామేగౌడ సేవను తెలుసుకున్న బారత మాజీ క్రికెట్‌ దిగ్గజం  వి.వి.ఎస్‌. లక్ష్మణ్‌ అభినందిస్తు ట్వీట్‌ చేశారు.

రైతు కామేగౌడ వేసవి కాలంలోప్రజలకు, జంతువులకు తాగునీటి కొరత ఉండకూడదనే ఆశయంతో దాసనదొడ్డి గ్రామంలో సుమారు 14 నీటి కుంటలను తవ్వించాడు. దాంతో ఎప్పడు ఈ నీటి చెరువుల్లో నీరు నిల్వ ఉంటుంది. వీటిని తవ్వడానికి ఈ రైతు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న లక్ష్మణ్‌... కామేగౌడను ట్విట్టర్‌లో ప్రశంసించారు. 

వి.వి.ఎస్‌. లక్ష్మణ్‌ చేసిన ట్వీట్‌ 

మరిన్ని వార్తలు