హైదరాబాద్: భారీ వర్షాలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా.. తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన నగరవాసులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో యాంటీ లార్వాను సిద్ధం చేసి ఉంచామని సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.