రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బూర రాజేషం(60) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.