శ్రీరాంపూర్ : ఆదిలాబాద్ జిల్లా మంచాల మండలం సీతారాంపల్లిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జాడి బాపు అనే వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. డబ్బుల విషయంలో గొడవపడి భార్య అంజలి(33)ని దారుణంగా హతమార్చాడు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.