వేరు కాపురం పెట్టలేదని..

8 Nov, 2016 12:48 IST|Sakshi
నల్గొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కంభంపాటి నాగరాజు, సులోచన (25) భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వేరు కాపురం పెట్టాలనే విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం భర్త బయటకు వెళ్లిన సందర్భంలో సులోచన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన అత్తమామలు మంటలార్పి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది.
 
మరిన్ని వార్తలు