ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

28 Nov, 2016 15:49 IST|Sakshi
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం అయ్యప్పనగర్‌కు చెందిన నాగిడి వెంకటేశ్వర్లు(25) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్ల మనస్తాపానికి గురై తనువు చాలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు