బెల్లంపల్లి: అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పాత రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పట్టణానికి చెందిన యువకుడిగా గుర్తించారు.