ప్రేమ, పెళ్లి, విషాదం

20 Dec, 2017 08:10 IST|Sakshi

యువకుడి చేతిలో మోసపోయిన యువతి ఆత్మహత్య

యాదగిరి జిల్లా : నీవే సరస్వం అన్నాడు.. నీవు లేని జీవితం వృథా అని వెంటపడి మరీ ప్రేమించాడు. తీరా ఇష్టం లేదని చెప్పడంతో ఆ యువతి తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన సంఘటన యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. హాలగెర గ్రామానికి చెందిన భాగ్యమ్మ (20), వడెగరా గ్రామానికి చెందిన నాగరాజు పరస్పరం ప్రేమించుకున్నాడు. ఈ విషయం భాగ్యమ్మ ఇంటిలో ఎవరికి తెలియదు. ఇదే సమయంలో భాగ్యమ్మకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని నాగరాజుకు చెప్పడంతో అతను పెళ్లి చేసుకుందామని బెంగళూరు తీసుకువచ్చాడు.

నెల రోజుల పాటు కలిసి తిరిగి తీరా పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించిన భాగ్యమ్మ కుటుంబ సభ్యులను బెంగళూరు పిలిపించుకుని సొంత ఊరుకు వెళ్లిపోయింది. ఈ విషయంపై భాగ్యమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేని భాగ్యమ్మ సోమవారం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు