రేపు పశ్చిమలో వైఎస్‌ జగన్‌ పర్యటన

28 Jan, 2017 13:26 IST|Sakshi
రేపు పశ్చిమలో వైఎస్‌ జగన్‌ పర్యటన
హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం(29 వ తేదీ) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని ఢిల్లీకి వినిపించేందుకు వైఎస్‌ఆర్సీపీ ద్వారకా తిరుమలలో బహిరంగ సభను నిర‍్వహించనుంది. ఈ సభలో  వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. అదే విధంగా జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, దివంగత కోటగిరి విద్యాధర రావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌ బాబు జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
 
ఆయనతో టీడీపీ మాజీ నేత ఎం.ఆర్‌.డి బలరామ్‌ సహా పలువురు నేతలు కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్‌ జగన్‌ రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. 
మరిన్ని వార్తలు