నేడు దానవాయిపేటకు జగన్

22 Nov, 2016 03:44 IST|Sakshi
నేడు దానవాయిపేటకు జగన్

దివీస్ బాధితులతో ముఖాముఖి

 సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామాన్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సందర్శించనున్నారు.

దివీస్ పరిశ్రమ స్థాపన వల్ల నష్టపోనున్న బాధిత ప్రజలతో మధ్యాహ్నం తర్వాత ముఖాముఖి మాట్లాడతారని, బహిరంగ సభలో వారినుద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు